జీవో నెం. 317 భాదితులకు న్యాయం చేయాలి: కోదండరాం

జీవో నెం. 317 భాదితులకు న్యాయం చేయాలి: కోదండరాం

హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జీవో నెం. 317 భాదిత ఉద్యోగ ఉపాధ్యాయ JAC అధ్వర్యంలో మనోవేదన మహాసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ప్రొఫెసర్ కోదండరాంకు రాఖీలు కట్టి.. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మాతో పాటు కలసి పోరాడాలని మహిళ ఉద్యోగులు కోరారు. 

జీవో నెం. 317 భాదితులు అందరూ కలసి కట్టుగా పోరాడాలని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. స్థానిక రిజర్వేషన్ ప్రకారం ఏ జిల్లాల వారికి.. ఆ జిల్లాల్లోనే రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాని కోరారు. జిల్లాల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. జీవో నెం. 317 విషయంలో స్థానికత ప్రాతిపదిక తీసుకోకుండా సీనియారిటీ ప్రాతిపదికను తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులను వేధిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణలోని 8 జిల్లాలలో ఇదే సమస్య ఉందన్నారు. స్థానికత ఆధారంగా ఏర్పడిన తెలంగాణలో స్థానికత అనే పదం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కారించాలని కోదండరాం కోరారు.

జీవో నెం. 317 నాన్ స్పౌజ్ భాదితులను తమ స్వంత జిల్లాలకు కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపులు చేయాలని కోరారు. సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి జీవో నెం. 317 భాదితులకు న్యాయం చేయాలని ఆకాంక్షించారు.