
అందాల పోటీల్లో కిరీటం గెలుచుకున్న వాళ్లలో చాలామంది ఆ తర్వాత హీరోయిన్స్గా రాణించారు. 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచి అందరి దృష్టిని ఆకట్టుకున్న మానుషి చిల్లర్ కూడా.. ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా బాటలో హీరోయిన్గా మెప్పించాలి అనుకుంది. ‘సమ్రాట్ పృథ్విరాజ్’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అవడమే కాదు.. ఆ తర్వాత ఆమె నటించిన ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, ఆపరేషన్ వాలంటైన్, బడే మియా చోటే మియా, టెహ్రాన్ చిత్రాలేవీ మానుషి ఆశించిన స్టార్డమ్ను అందించలేకపోయాయి.
దీంతో ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ‘మాలిక్’ చిత్రంపైనే. ఇందులో ఆమె రాజ్ కుమార్ రావ్కు జంటగా నటించింది. మాలిక్ కి ధడ్కన్ అంటూ మంగళవారం ఆమె ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయడంతో పాటు ‘నామూకిన్’ అనే పాటను కూడా విడుదల చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో రూత్లెస్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నాడు రాజ్ కుమార్ రావ్. పుల్కిత్ దర్శకత్వం వహిస్తుండగా టిప్స్ సంస్థ నిర్మిస్తోంది. జులై 11న సినిమా విడుదల కానుంది.