ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నం : విప్​ గంప గోవర్ధన్​

ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నం : విప్​ గంప గోవర్ధన్​

కామారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు.  కామారెడ్డి టౌన్, దోమకొండ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు  బుధవారం బీఆర్ఎస్​లో చేరారు. వీరికి గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

విప్​మాట్లాడుతూ.. డబుల్​ఇంజిన్​ సర్కారు అంటూ చెబుతున్న బీజేపీ, వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్​హయాంలో  చాలా ఇబ్బందులు ఎదుర్కున్నామన్నారు. ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వాలంటూ.. ఆరు గ్యారెంటీలతో ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి,  పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ఎంకె ముజీబోద్దీన్, లీడర్లు కొమ్ముల తిర్మల్​రెడ్డి, మదుసూధన్​రావు, తిర్మల్​గౌడ్ తదితరులు పాల్గొన్నారు.