జార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధన్బాద్ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గు గని కూలిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం 10.30గంటల సమయంలో భారత్ కోకింగ్కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లోని భౌరా కాలరీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని భౌరా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బినోద్ ఓరాన్ తెలిపారు. గనిలోకి అక్రమంగా మైనింగ్ చేపడుతున్నప్పుడు స్థానిక గ్రామస్థులు అనేకమంది పనుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.