సంక్రాంతి పండుగకు పట్నం పబ్లిక్ పల్లె బాట

సంక్రాంతి పండుగకు పట్నం పబ్లిక్ పల్లె బాట

హైదరాబాద్ : సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. సొంతూళ్లలో పండుగ జరుపుకునేందుకు జనం పల్లెలకు క్యూ కట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో నివసిస్తున్న చాలా మంది పండక్కి తమ పల్లెలకు పయనమయ్యారు. పండుగ రద్దీ కారణంగా బస్సు స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సొంతూళ్లకు వెళ్తున్న ప్యాసింజర్స్ తో ఎల్బీనగర్ లో విపరీతమైన రద్దీ నెలకొంది. 

ఈనెల 13వ తేదీ నుండి సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ముందుగానే ఏపీ, తెలంగాణ ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఎల్బీనగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది.ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా టెంట్ లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు బస్సుల అప్డేట్స్ ఇస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.