సీనియర్లు నాకు మద్దతు ప్రకటించిండ్రు

సీనియర్లు నాకు మద్దతు ప్రకటించిండ్రు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనకు చాలా మంది సీనియర్లు మద్దతు ప్రకటించారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పదవికి కచ్చితంగా పోటీ చేయాలని వారంతా తనను కోరినట్లు  చెప్పారు. వారి ప్రోత్సాహం వల్లే  తాను అధ్యక్ష బరిలో నిలబడినట్లు పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ లో జీ–23 నేతలెవరూ లేరని, తామంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం తమ లక్ష్యం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడటమేనని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉన్నందున.. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ రాజ్యసభా పక్షనేత పదవికి రాజీనామా చేశానని మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎలాంటి ఎన్నికలు లేకుండా ఎవరో ఒకరూ అధ్యక్ష పదవి చేపట్టేలా ఏకాభిప్రాయానికి వద్దామని శశి థరూర్ తో మాట్లాడినట్లు ఖర్గే తెలిపారు.