
సికింద్రాబాద్, వెలుగు: తిరుపతి రూట్ లో నడుస్తున్న పలు రైళ్లను ఈ నెల16 నుంచి 23 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు, 19న మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజూ చెన్నై సబర్బన్ టెర్మినల్– తిరుపతి, తిరుపతి–-అరక్కోణం-–తిరుపతి, చెన్నై సెంట్రల్– తిరుపతి–చెన్సై సెంట్రల్, విల్లుపురం–తిరుపతి–-విల్లుపురం స్టేషన్ల మధ్య నడిచే ఈ రైళ్లను తిరుచనూర్– -తిరుపతి, కాట్పాడి-– తిరుపతి స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అలాగే రామేశ్వరం– -ఓకా మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును కాట్పాడి, పాకాలా, ధర్మవరం, గుత్తి స్టేషన్ల మీదుగా మళ్లించారు. హజరత్ నిజాముద్దీన్- – తిరువనంతపురం ఎక్స్ప్రెస్ కాట్పాడి, అరక్కోణం, రేణిగుంట మీదుగా, మంగుళూరు సెంట్రల్– సంత్రగచ్చి, ఎస్ఎంవీటీ బెంగుళూరు-– టాటానగర్ఎక్స్ప్రెస్, ఎస్ఎంవీటీ బెంగుళూరు-– హతియా ఎక్స్ప్రెస్, హజరత్నిజాముద్దీన్– ఎర్నాకులం మార్గంలో నడిచే ఎక్స్ప్రెస్లను కాట్పాడి, అరక్కోణం, రేణిగుంట మీదుగా దారి మళ్లించి నడుపుతున్నారు. దారి మళ్లింపు ఈనెల16 నుంచి23 వరకు కొనసాగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.