ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు పలు రైళ్లు రద్దు

ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: సెంట్రల్​ రైల్వేస్​ పరిధిలోని సాంగ్లీ - మీరజ్​ స్టేషన్ల మధ్య జరుగుతున్న  ట్రాక్​ డబ్లింగ్​, ఇంటర్​లాకింగ్​ పనుల నేపథ్యంలో  ఈ నెల 26నుంచి జనవరి 6 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రద్దయినవాటిలో  మీరజ్​-పార్లీ -మీరజ్​, కొల్లాపూర్-నాగ్​పూర్​-కొల్లాపూర్​, కొల్లాపూర్​-ధన్​బాద్​-కొల్లాపూర్​స్టేషన్ల మధ్య నడిచే ఎక్స్​ప్రెస్ రైళ్లు ఉన్నాయి.అలాగే.. తిరుపతి-కొల్లాపూర్​-తిరుపతి మధ్య నడిచే ఎక్స్​ప్రెస్​ రైళ్లను వచ్చే నెల 5 దాకా బెలగావి వరకు మాత్రమే  నడపనున్నారు. నాగ్​పూర్-కొల్లాపూర్​మధ్య నడిచే ఎక్స్​ప్రెస్​ రైలును కుర్డువాడి వరకు నడుపుతున్నట్లు అధికారులు  పేర్కొన్నారు. ఈ మార్పులను ప్యాసింజర్లు గమనించాలని సూచించారు.