జయశంకర్ భూపాలపల్లి : ప్రీతి మృతికి కారకులైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి వెంకట్ సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెబుతున్న ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. వరంగల్ లో వైద్య విద్యార్థిని ప్రీతిని సీనియర్ సైఫ్ ర్యాగింగ్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నా యాజమాన్యం ఆ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని వెంకట్ ఆరోపించారు. ప్రీతికి న్యాయం చేయాలని విద్యార్థులు ధర్నాలు చేస్తుంటే ఆమె ఆత్మహత్యకు సైఫ్ కారణం కాదని హాస్పిటల్ యాజమాన్యం బుకాయిస్తోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫీసుల్లో మహిళలపై వేధింపులు, కాలేజీల్లో ర్యాగింగ్ నిత్యకృత్యమయ్యాయని ఫలితంగా మహిళలు ఇంటికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్ఫూర్తితో మహిళలంతా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రీతిని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలె: మావోయిస్టులు
- వరంగల్
- February 27, 2023
లేటెస్ట్
- అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..
- బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
- Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్
- V6 DIGITAL 25.04.2024 EVENING EDITION
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
- Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
- NEFT, RTGS అంటే ఏమిటి? ఈ లావాదేవీలకు చార్జీలు ఉంటాయా? పూర్తి వివరాలు ఇవే..
- దేశ ప్రజలు మోదీ నుండి విముక్తి కోరుకుంటున్నారు: సీతక్క
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి