మావోయిస్టుల స్తూపాలు ..ధ్వంసం చేసిన మహిళా కమాండోలు

మావోయిస్టుల స్తూపాలు ..ధ్వంసం చేసిన మహిళా కమాండోలు

భద్రాచలం,వెలుగు:  చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు నిర్మించిన స్మారక స్తూపాలను మహిళా కమాండోలు శుక్రవారం ధ్వంసం చేశారు. భేచాపాల్​ అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్​ఫైటర్స్ మహిళా కమాండోలు కూంబింగ్​కు వెళ్లారు. దట్టమైన అడవుల్లో అమరులైన మావోయిస్టులను స్మరించుకునేందుకు స్తూపాలను నిర్మించారు. దీంతో వీటిన చూసిన మహిళా కమాండోలు కూల్చి వేశారు.