మావోయిస్టు కమాండర్​ లొంగుబాటు

మావోయిస్టు కమాండర్​ లొంగుబాటు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట సోమవారం ఓ మావోయిస్టు దళ కమాండర్​ లొంగిపోయాడు. సుక్మా ఎస్పీ కిరణ్​ చౌహాన్​ కథనం ప్రకారం...2010లో జిల్లాలోని తాడిమెట్ల వద్ద మావోయిస్టులు అంబుష్​ చేసి 76 మంది జవాన్లను హత్య చేశారు. ఇందులో పాల్గొన్న కమాండర్​నగేశ్​అలియాస్​ఎర్రా.. మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చక జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకుని సుక్మా పోలీసులను సంప్రదించాడు.

ఇతడిపై రూ.8లక్షల రివార్డు ఉంది. ప్రస్తుతం పీఎల్​జీఏ కంపెనీ బెటాలియన్​నెంబరు2 కంపెనీకి కమాండర్​గా నగేశ్​వ్యవహరిస్తున్నాడు. మావోయిస్టులు లొంగిపోవాలని, ప్రభుత్వం తరుపు నుంచి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని సుక్మా ఎస్పీ కిరణ్​ చౌహాన్​ప్రకటించారు.