
మరాఠా రిజర్వేషన్ ఉద్యమం ఊపందుకుంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని మజల్గైన్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే ఇంటిపై నిరసనకారులు రాళ్లతో దాడి చేయడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఆగ్రహించిన ఆందోళనకారులు ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటిపై రాళ్లు రువ్వడం ఈ వీడియోలో చూడవచ్చు. వారి నిరసనలో భాగంగా కొందరు అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు.. ఎమ్మెల్యే ఇంటికి కూడా నిప్పు పెట్టడం ఆందోళనకరంగా మారింది. ఎమ్మెల్యే ఇంట్లో నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నట్లు కూడా ఈ వీడియోలో చూడవచ్చు.
మరాఠా నిరసనకారుల నిరాహారదీక్షకు వ్యతిరేకంగా బీడ్లోని మజల్గావ్లోని ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఆరోపించిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన నిరసనకారులు రాళ్లు రువ్వారు, వాహనాలను తగులబెట్టారు. ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే జారంగే పాటిల్ను దూషించారని ఆరోపణలు వ్యాపించడంతో నిరసనకారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. మజల్గావ్లో నిరసనకారులు కవాతు నిర్వహిస్తున్నారని, ఆ తర్వాత కొందరు ఆందోళనకారులు హింసాత్మకంగా మారి ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం ప్రారంభించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇంటి అద్దాలు పగులగొట్టి ఇంటి బయట పార్క్ చేసిన కార్లపై కూడా దాడి చేశారు. ఇళ్లు, కార్లకు కూడా నిప్పు పెట్టారు.
Angry protestors pelted stones, torched a vehicle parked at MLA Prakash Solanke's residence at Majalgaon, Beed for his alleged remarks against the ongoing hunger strike of Maratha protestors. #MarathaReservation pic.twitter.com/8zjz28abNo
— Samrat Phadnis (@PSamratSakal) October 30, 2023