టైగర్ నాగేశ్వరరావు నుంచి మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ రిలీజ్

టైగర్ నాగేశ్వరరావు నుంచి మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ రిలీజ్

స్టూవర్ట్‌‌‌‌పురం గజదొంగ నాగేశ్వరరావుగా రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. ఇప్పటికే ఓ పాటను విడుదల చేసిన మేకర్స్, గురువారం ‘వీడు’ అంటూ సాగే మాస్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘‘వీడు.. వీడు.. ఎదురొచ్చిన వాడ్ని తొక్కేస్తాడు వీడు.. వీడు.. వీడు.. ఎదిరించిన గొంతు నొక్కేస్తాడు వీడు.. ఎదగడమే జన్మ హక్కంటాడు వీడు..” అంటూ సాగే ఈ పాటను జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్‌‌‌‌గా పాడాడు. 

‘‘అందరూ ఆగిపోయిన చోట మొదలవుతాడు వీడు.. అందరినీ భయపెట్టే చీకటిని భయపెడతాడు వీడు.. అవసరమనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు.. సచ్చిపోయేటప్పుడు ఏదో తీసుకు పోయేవాడు వీడు..’ అంటూ నాగేశ్వరరావు పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా చంద్రబోస్ లిరిక్స్ రాశారు. ఈ పాటలో మ్యాసియస్ట్ అవతార్‌‌‌‌లో ఫెరోషియస్‌‌‌‌గా కనిపిస్తున్నాడు రవితేజ. దసరా కానుకగా అక్టోబర్ 20న సినిమా విడుదల కానుంది.