ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థికి కాకుండా అపోజిషన్ పార్టీ అభ్యర్థికి ఓటేశారు. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ రావు 480 ఓట్లు సాధించారు. దాంతో టీఆర్ఎస్ అభ్యర్థి 250 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తమకు ఓట్లు లేకున్నా బరిలో నిలిచిన కాంగ్రెస్ కు 116 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఆ పార్టీ అభ్యర్థికి మాత్రం 243 ఓట్లు వచ్చాయి. దాంతో తమకు రావాల్సిన చాలా ఓట్లు క్రాస్ అయినట్లు విజయం సాధించిన మధు అన్నారు. దాదాపు 141 ఓట్లు క్రాస్ అయినట్లు గుర్తించినట్లు.. వారెవరో తమకు తెలియదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తాతా అన్నారు.