ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మందికి గాయాలు

ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మందికి గాయాలు

బీహార్ లో ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలి 30మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ఘటన ఔరంగాబాద్ జిల్లా శాప్ గంజ్ ప్రాంతంలో జరిగింది. తెల్లవారుజామున 2:30 గంటలకు ఓ కుటుంబం ఛత్ పూజ కోసం వంట చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అనిల్ గోస్వామి కుటుంబ సభ్యులు ఛత్ పూజ కోసం సూర్యోదయం వేళ ప్రసాదం తయారు చేస్తుండగా గ్యాస్ సిలిండర్లు పేలి, భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పడానికి స్థానికులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ ఘటనలో 30 మంది గాయాలపాలయ్యారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో  ఏడుగురు పోలీసు సిబ్బందికి కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఔరంగాబాద్‌లోని సదర్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనకుగల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.