హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల సమిట్లో ఏకంగా రూ. 5 లక్షల 75 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు సోమవారం రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. రెండో రోజు అది మరింత పెరిగింది.
మంగళవారం ఒక్కరోజే రూ. 3 లక్షల 32 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంధన, ఐటీ, పర్యాటక, ఫార్మా రంగాల దిగ్గజాలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు వచ్చిన పెట్టుబడుల్లో విద్యుత్రంగం సింహభాగంలో నిలువగా.. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు వచ్చాయి.
డేటా సెంటర్ల హబ్గా తెలంగాణ: డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు వచ్చాయి.
- ఇన్ఫ్రాకీ డిసి పార్క్స్: 150 ఎకరాల్లో 1 గిగావాట్ డేటా పార్క్ కోసం రూ. 70,000 కోట్ల సంచలనాత్మక పెట్టుబడి
- జెసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్: డేటా సెంటర్ల కోసం రూ. 9,000 కోట్లు (2 వేల ఉద్యోగాలు)
- ఏజీపీ గ్రూప్: 1 గిగావాట్ డేటా సెంటర్ కోసం రూ. 6,750 కోట్లు
- ఆక్వెలాన్ నెక్సస్: 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్
- పర్వ్యూ గ్రూప్: 50 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్ (3 వేల ఉద్యోగాలు)
- బ్లాక్స్టోన్: ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కుల్లో పెట్టుబడులకు ఆసక్తి

