
- గవర్నర్ తమిళిసైకు రాజ్యాంగ పరిరక్షణ వేదిక నేతల వినతి
హైదరాబాద్:రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని రాజ్యాంగ పరిరక్షణ వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైను కలసి వినతిపత్రం అందజేశారు. వేదిక తరపున ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తదితరులు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలసి కేసీఆర్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. సర్కార్ తప్పులు గుర్తు చేసేందుకు ఈనెల 9న శాంతియుతంగా యుద్ధభేరి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు నేతలు. ఈనెల 9న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. నిరసనకు పర్మిషన్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా ర్యాలీ జరిపి తీరుతామని స్పష్టం చేశారు నేతలు. గవర్నర్ తో సమావేశం అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు.
రాజ్యాంగం మీద కేసీఆర్ వాఖ్యలు అహంకార పూరితం: మంద కృష్ణ మాదిగ
రాజ్యాంగం మీద కేసీఆర్ వాఖ్యలు అహంకార పూరితమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సీఎం తన వ్యాఖ్యలు ఉపసహరించు కుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పునరుద్ఘాటించారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 9న ఇందిరాపార్క్ వద్ద యుద్ధభేరి శాంతియుతంగా చేస్తామన్నారు. కేసీఆర్ సర్కార్ నిరాకరణ చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ సర్కార్ హరించి వేస్తోందని.. సభలు సమావేశాలు నిర్వహించుకునే హక్కులను హరిస్తుందన్నారు. గవర్నర్ ను సైతం కేసీఆర్ లెక్క చేయక పోవడం అహంకార పూరితం అన్నారు. కేసీఆర్ తన అవసరాల కోసం ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు చేస్తారు.. ప్రజల సమస్యల కోసం ప్రతిపక్షాలు చేస్తాం అంటే అనుమతి ఇవ్వడం లేదని, తెలంగాణలో ప్రజాస్వామ్యన్ని కాపాడాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై ఈ నెల 3 న సిటీ కమిషనర్ ను,6 న డీజీపీని కలుస్తామన్నారు. 9న నిర్వహించే యుద్ధ భేరీ మహా సభ ను ప్రజలు విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి యుద్ధ భేరికి వస్తారని మందకృష్ణ తెలిపారు.
కేసీఆర్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్
సీఎం కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యలు చాలా విరుద్ధమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ సీఎం అయ్యాడని గుర్తు చేశారు. దళితుల,బిసిల,మైనారిటీ లా సంక్షేమం కోసం మార్చాలి అంటున్నారు.. కానీ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదన్నారు. సీఎం చేసిన వ్యాఖ్యలు గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామని.. ఈనెల 9 న నిరసన కు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను విజ్ఞప్తి చేశామన్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. ఇవ్వక పోయినా ర్యాలీ చేస్తామన్నారు. ప్రభుత్వ తప్పిదాలు గుర్తు చేసేందుకే ర్యాలీ నిర్వహిస్తామన్నారు కోదండరామ్.
రాజ్యాంగం కల్పించిన హోదాలో ఉంటూ..మార్చాలని చెప్పడం దారుణం: జాజుల శ్రీనివాస్ గౌడ్
రాజ్యాంగం కల్పించిన హోదాలో ఉంటూ..మార్చాలని చెప్పడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రధమ పౌరురాలు అయిన గవర్నర్ కే కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదన్నారు. అధికార పక్షం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని రాజ్యాంగ వ్యతిరేక చర్యలకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎంతో క్షమాపణ చెప్పించాలని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. తెలంగాణలో బిసిలు ఇతర సామాజిక వర్గాలు అంటే సీఎం కి లెక్కే లేదు
రాష్ట్రపతిని సైతం కలుస్తాం: అద్దంకి దయాకర్
సీఎం కేసీఆర్ వ్యవహారం పై రాష్ట్రపతిని సైతం కలుస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ రాజ్యాంగ ద్రోహిని, పాలించే హక్కు లేదన్నారు. నిరసనకు కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు. గవర్నర్ ను కలిసి యుద్ధ భేరి మహా సభకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం... ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
యుద్ధంపై భారత విధానం బాగుందన్న రష్యా మంత్రి
రాజ్నాథ్సింగ్తో బండి సంజయ్ భేటీ
మీపై చైనా దాడి చేస్తే.. రష్యా ఆదుకుంటదా?