పార్లమెంట్ లో కలకలం.. లోక్ సభ జరుగుతున్న సమయంలో.. గ్యాలరీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు.. గ్యాలరీ నుంచి సభలోకి దూసుకొచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు.. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ బాటిళ్లను.. సభ మధ్యలో విసిరేశారు. లోక్ సభ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగటం కలకలం రేపింది. గ్యాస్ బాటిళ్ల నుంచి పసుపు రంగులోని పొగ.. లోక్ సభ అంతా వ్యాపించింది.
ఈ ఘటనతో షాక్ అయిన లోక్ సభలోని ఎంపీలు.. సభ నుంచి బయటకు పరుగులు తీశారు. సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు యువకుల వయస్సు 20 ఏళ్ల మధ్య ఉంటుందని.. ఓ కుర్రోడు స్పీకర్ చైర్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడని.. మధ్యలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని ఎంపీలు చెబుతున్నారు.
#Breaking: Security Breach In Loksabha:
— Shantanu (@shaandelhite) December 13, 2023
Two persons jumped into the house from one of the galleries and threw something that emitted fluorescent gas. pic.twitter.com/fDRd7AJ1tQ
అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అగంతకులను అదుపులోకి తీసుకున్నారు. అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అయితే సరిగ్గా 22 ఏళ్ల క్రితం 2001 లో ఇదే రోజు (డిసెంబర్ 13) న పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి చేయడం గమనార్హం.