ప‌ట్ట‌ప‌గలే న‌గ‌ల దుకాణంలో భారీ దోపిడీ.. రూ. 3కోట్ల విలువైన బంగారం చోరీ

ప‌ట్ట‌ప‌గలే న‌గ‌ల దుకాణంలో భారీ దోపిడీ.. రూ. 3కోట్ల విలువైన బంగారం చోరీ

7 కిలోల బంగారం, 30 ల‌క్ష‌ల న‌గ‌దు చోరీ

విజయవాడ: విజ‌య‌వాడ న‌‌గ‌రంలోని ఓ న‌గ‌ల దుకాణంలో ప‌ట్ట‌ప‌గ‌లే భారీ దోపిడీ జ‌రిగింది. వ‌న్‌టౌన్ లోని సాయిచరణ్ జ్యుయలరీలో 7 కిలోల (రూ. 3 కోట్ల విలువైన‌‌)బంగారం, రూ. 30 లక్షల నగదును చోరీ గురైన‌ట్టు ఆ షాపు యాజమాన్యం తెలిపింది. నిందితులు.. షాపులో పనిచేసే సిబ్బంది కాళ్లు, చేతులు కట్టేసి దోపీడీకి పాల్పడిన‌ట్టు తెలిపారు. ఈ దోపిడీ గురించి స‌మాచారమందుకున్న వ‌న్‌టౌన్ పోలీసులు ఘటన స్థలాన్నిపరిశీలించారు. తెలిసిన వారే ఈ దోపీడీకి పాల్పడినట్టుగా వారు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించి , నిందితుల ఆచూకీ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. దోపీడీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.