భారీ చోరీ : షాపింగ్‌కు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

భారీ చోరీ : షాపింగ్‌కు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల

మేడ్చల్ జిల్లా కీసర మండలంలో భారీ చోరీ జరిగింది. షాపింగ్ కోసం చార్మినార్ కు వెళ్లిన ఓ కుటుంబం..  తిరిగొచ్చే సరికి వారి ఇల్లును గుల్ల చేశారు దుండగలు.  ఈ ఘటన నాగారంలోని సాయి ధరణి కాలనిలో జరిగింది.  దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి 11 తులాల బంగారం,  సెల్ ఫోన్, 110000/- నగదు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు  సమాచారమందించారు. ఏసీపీ శివకుమార్ ఘటనాస్థలికి చేరుకొని, యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.