మొబైల్ ఛార్జింగ్ పెట్టి చోరీ.. 12 తులాల బంగారం, 60 తులాల వెండితో జంప్

మొబైల్ ఛార్జింగ్ పెట్టి చోరీ.. 12 తులాల బంగారం, 60 తులాల వెండితో జంప్

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సాయిరాంనగర్​ కాలనీ(చైతన్య నగర్​)లో నివసిస్తున్న కమాలోద్దిన్​రాత్రి తన తండ్రి ఇంటి వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది.అప్పటికే చోరీలో బిజీగా ఉన్న దొంగలు యజమాని అలికిడి వినగానే ఛార్జింగ్​ పెట్టుకున్న తమ ఫోన్​ వదిలేసి పరారయ్యారు. యజమాని వారిని పట్టుకోవాలని చూసిన ఫలితం లేకుండా పోయింది. 12 తులాల బంగారం, 60 తులాల వెండి, రూ.24 వేల క్యాష్​ చోరీ చేసినట్లు ఆయన తెలిపారు.  బాధితుడి ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.