
మేళ్లచెరువు, వెలుగు: ‘మేము ఊళ్లో ఉండట్లేదు.. మా ఓట్లు తొలగించాలంటూ’ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు తహసీల్దార్కు ఫోర్జరీ సంతకాలతో భారీగా ఫేక్ అప్లికేషన్లు అందాయి. ఒకే ఊరి నుంచి అన్ని అప్లికేషన్లు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు గ్రామానికి వెళ్లి విచారించగా అవన్నీ ఫేక్ అని తేలింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలంలోని రామాపురం నుంచి 350 మంది గ్రామస్తులు తాము ఊరిలో ఉండట్లేదని.. తమ ఓట్లు తొలగించాలంటూ పెట్టుకున్న ఫాం7 అప్లికేషన్లు తహసీల్దార్ఆఫీసుకు చేరాయి. ఒకేసారి అన్ని రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు గ్రామంలో విచారణ చేపట్టగా అవన్నీ ఫేక్ అప్లికేషన్లని తెలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామస్తుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇలా అప్లై చేశారని తేలింది. దీంతో 20 మంది బాధితులు శుక్రవారం తహసీల్దార్దామోదర్రావును కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.