Telangana Kitchen: మష్రూమ్స్ బిర్యానీ.. పిల్లలే కాదు.. పెద్దలు కూడా లొట్టలేస్తారు..!

Telangana Kitchen: మష్రూమ్స్  బిర్యానీ.. పిల్లలే కాదు.. పెద్దలు కూడా లొట్టలేస్తారు..!

రోజు ఒకే రకమైన ఫుడ్​ తింటే బోరు కొడుతుంది.. తినాలంటే పిల్లలు మారాం చేస్తుంటారు.. రోజూ ఇదేనా అని మొహం పక్కకు తిప్పుతారు. అప్పుడప్పుడు బిర్యానీ పెడతారు.. ఈ మధ్య కాలంలో అది కూడా రొటీన్​ అయింది.  వెరైటీ గా బిర్యానీ తయారుచేస్తే పిల్లలే కాదు.. పెద్దలు కూడా లొట్టలేసుకొని తింటారు.  వెరైటీటా మష్రూమ్స్ తో బిర్యానీ ఎల తయారు చేసుకోవాలో తెలుసుకుందాం....  

 బిర్యానీ తయారీ కావాల్సినవి:

  • మష్రూమ్స్ (తరిగి) – 900 గ్రాములు
  • బాస్మతి బియ్యం- నాలుగు కప్పులు
  • ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు
  • పచ్చిమిర్చి- నాలుగు
  • టొమాటో తరుగు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • క్యారెట్ తరుగు- రెండు టేబుల్ స్పూన్స్
  • అల్లం తరుగు - మూడు టీ స్పూన్స్
  • వెల్లులి- మూడు రెబ్బలు
  • నెయ్యి లేదా నూనె - అర కప్పు
  • నిమ్మకాయ - ఒకటి
  • లవంగాలు- ఏడు
  • దాల్సినచెక్క - కొంచెం
  • యాలకులు- మూడు
  • ధనియాల పొడి - మూడు టీ స్పూన్స్
  • సోయాసాస్ - రెండు టీ స్పూన్స్
  • కారం - ఒకటిన్నర టీ స్పూన్
  • ఉప్పు - సరిపడా
  • నీళ్లు - ఏడు కప్పులు
  • పుదీనా- కొంచెం

ఇలా చేయాలి: బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి గంటసేపు నానబెట్టి నీళ్లు వడగట్టి పక్కనబెట్టాలి. ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేడిచేసి, నానబెట్టిన బియ్యం వేసి ఐదునిమిషాలు వేడిచేయాలి. అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క గ్రైండ్ చేయాలి..

ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేడిచేయాలి. స్టవ్ సన్నటి మంట మీద పెట్టి మసాలా ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు వేగించాలి. అందులో సన్నగా, నిలువుగా తరిగిన ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి, క్యారెట్,టొమాటో తరుగు వేసి వేగించాలి. తర్వాత మష్రూమ్స్ ముక్కలు కూడా వేసి పది నిమిషాలు వేగించాలి.

ఇప్పుడు. ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. ముక్కలన్నీ వేగాక ఏడు కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం వేసి కుక్కర్ మూత పెట్టి సిమ్​ లో  రెండు లేదా మూడు విజిల్స్ రానివ్వాలి. చివరిగా పుదీనాతో గార్నిష్ చేయాలి