బీజేపీ నాయకులు అబద్దాలు చెబుతున్నారు

బీజేపీ నాయకులు అబద్దాలు చెబుతున్నారు

కరీంనగర్: కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు టూరిస్టుల్లా తిరుగుతున్నారని మేయర్ సునీల్ రావు అన్నారు.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తుండటంపై ఆయన సటైర్ వేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి నేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో కనీసం 10 శాతమైన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిందా అని ప్రశ్నించారు. దమ్ముంటే తమ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సునీల్ రావు సవాల్ విసిరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం... అవి తమ పథకాలే అంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అవాస్తవాలు చెబుతూ ప్రజలను మోసం చేయాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, అయితే ప్రజలు అవేమీ పట్టించుకోరని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలే టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తాయని సునీల్ రావు ధీమా వ్యక్తం చేశారు.