ఉద్యోగులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతోనే అవార్డులు : గద్వాల్ విజయలక్ష్మి

ఉద్యోగులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతోనే అవార్డులు : గద్వాల్ విజయలక్ష్మి
  • మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు :  అధికారులు, కార్మికుల కృషి, ప్రజల సహకారంతోనే బల్దియాకు  అవార్డులు వచ్చాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-–2023 కింద పొందిన అవార్డులను శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి శుక్రవారం మేయర్ కు  అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వచ్చే రోజుల్లో బల్దియాకు దేశ స్థాయిలో అవార్డులు రావాలని

అందుకు అధికారులు, సిబ్బంది, కార్మికులు, ప్రజల సహకారం అవసరమని  కోరారు. దేశంలో 9వ క్లీన్ సిటీ, స్టార్ రేటింగ్ పొందిన చెత్త రహిత నగరం,  తెలంగాణలో స్వచ్ఛ నగరం, రాష్ట్రంలో మొదటి 5 స్టార్ రేటింగ్ పొందిన సిటీ (జనాభా > 1 లక్ష), వాటర్ ప్లస్ సిటీగా మళ్లీ గుర్తింపు పొందిందని ఆమె వివరించారు.