ఎప్ స్టీన్ సెక్స్ స్కాండల్ మెయిల్స్ మరోసారి ప్రకంపనలు సృష్టించాయి. అనేకమంది ప్రముఖుల పేర్లు, ప్రస్తావన ఈమెయిల్స్ లో ఉన్నాయి. ఎప్ స్టీన్ ఫైల్ ట్రాన్సపరెన్సీ చట్టం కింద అమెరికా న్యాయ శాఖ వెబ్ సైట్ లో ఈ డాక్యుమెంట్లు, వీడియోలు, పొటోలు ఉంచారు. ఇప్పటికే ట్రంప్, బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూలకు సంబందించిన ఈమెయిల్స్ వెలుగులోకి రాగా.. తాజాగా ప్రధాని మోదీకి సంబంధించిన మెయిల్స్ను విడుదల చేశారు. అయితే ఈ మెయిల్స్ లోని విషయాలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మెయిల్స్ ను ఎప్ స్టీన్ చెత్త ఊహాగానాలంటూ కొట్టిపారేసింది.
అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన డజనుకు పైగా మెయిల్స్ , ఫోన్ మేసేజ్ లలో భారత్, ప్రధాని మోదీ గురించి ఎప్ స్టీన్ ప్రస్తావించారు. 2017జూన్ 25, 26 తేదీల్లో మోదీ, ట్రంప్ సమావేశం, అదే ఏడాది జూలైలో ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు లింక్ పెట్టాడు. అమెరికా అధ్యక్షుడి సలహా పాటించినందుకు ఇజ్రాయెల్ టూర్ సక్సెస్ అయిందని చెప్పుకొచ్చాడు.
►ALSO READ | ఈసారి మాత్రం మూములుగా ఉండదు: అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్
అయితే ఎప్ స్టీన్ ఫైళ్లు అని ఈమెయిల్స్ లో ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన ప్రస్తావనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి ఎప్ స్టీన్ చెత్త పుకార్లు తప్ప మరేమీ కాదని తోసిపుచ్చింది.
మిలియనీర్, మైనర్లపై సెక్స్ స్కాండల్ లో దోషి ఎప్ స్టీన్కార్యకాలాపాలపై దర్యాప్తులో భాగంగా యూఎస్ న్యాయశాఖ దాదాపు 30లక్షల పేజీల ఈమెయిల్స్లో ప్రధాని మోదీ టూర్ప్రస్తావన కూడా ఉంది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్పర్యటన వెళ్లే సందర్భంగా ఈ మెయిల్స్ చర్చనీయాంశంగా మారాయి.
