
బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో ఆయన్ను చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని ఫోన్ చేశారు. తమ టీమ్ లు హైదరాబాద్లో ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరారు. రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో కాలికి సర్జరీ చేయించుకున్నారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది.
జూన్ 23న మొదటి బెదిరింపు
జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఒక వ్యక్తి ఫోన్ చేసి ‘‘నేను మావోయిస్టును.. మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నా.. సాయంత్రం లోగా నిన్ను లేపేస్తాం.. దమ్ముకంటే కాపాడుకోండి’’ అని బెదిరించాడు. దీంతో ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు.
ALSO READ | అది ఉగ్రవాదం కాదు.. చట్టబద్దమైన పోరాటం: మరోసారి భారత్పై విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
ఎంపీ అనుచరులు ఫోన్ చేసిన వ్యక్తితో మాట్లాడారు. ఎక్కణ్నుంచి కాల్ చేస్తున్నారని అడగగా.. ‘‘మావోయిస్టులు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారు. రాత్రి 12 గంటల వరకు సార్ ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటారు.. సార్ ను జాగ్రత్తగా ఉండమని చెప్పండి’’ అని చెప్పాడు. ఆగంతకుడి బెదిరింపు కాల్ గురించి ఎంపీ రఘునందన్ రావు.. పోలీసులకు సమాచారం అందించారు. దుండగుడు +912143352974 అనే నంబర్ నుంచి ఫోన్ కాల్ చేసినట్లు డీజీపీ, సంగారెడ్డి ఎస్పీ కి ఫోన్ లో సమాచారం అందించారు.
తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 26న తెలంగాణ ప్రభుత్వం భద్రతను పెంచింది. రఘునందన్ టూర్లలో ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.