ఉపాధిహామీకి కేంద్ర ప్రభుత్వం ఉరి : కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు

ఉపాధిహామీకి కేంద్ర ప్రభుత్వం ఉరి : కాంగ్రెస్ ఇన్చార్జి  నీలం మధు
  • మెదక్​ పార్లమెంట్​ కాంగ్రెస్​ ఇన్​చార్జి  నీలం మధు 

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు: ఉపాధిహామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఉరేసిందని మెదక్​ పార్లమెంట్​కాంగ్రెస్​ ఇన్​చార్జి నీలం మధు ఆరోపించారు. మహాత్మగాంధీ పేరుతోనే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్​ చేశారు. ఆదివారం కాంగ్రెస్​ ఆవిర్భవాన్ని పురస్కరించుకొని చిట్కుల్​ జెండా ఆవిష్కరించారు. అనంతరం టీపీసీసీ పిలుపు మేరకు ఇస్నాపూర్​ మున్సిపల్​ పరిధిలోని చిట్కుల్​ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 

అనంతరం మాట్లాడుతూ 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​నేతృత్వంలో గాంధీ పేరుతో ఎన్ఆర్ఈజీఎస్​ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కేంద్రం 90శాతం, రాష్ర్ట ప్రభుత్వాలు 10 శాతం నిధులు సమకూర్చడం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధి లభించిందన్నారు. 

పేద ప్రజల ఉపాధిని ఓర్వలేని బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని బలహీన పరిచి కొత్త పేరుతో ప్రవేశపెట్టి  పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ  సర్పంచ్​రవీందర్,  పీఏసీఎస్​ మాజీ చైర్మన్​ నారాయణరెడ్డి, నాయకులు వెంకటేశ్, అజ్జు, అశోక్​, గోపాల్,  గౌరీశంకర్, అనిల్​కుమార్, కరణ్, యాదయ్య, నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.