మెదక్ జిల్లా నార్సింగి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు వర్షంలో తడుస్తూ చదువుకోవాల్సి వస్తోంది. ఈ స్కూల్లో 5 తరగతులకు గాను 130 మంది విద్యార్థులు ఉండగా, మూడు గదులున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి స్కూల్ బిల్డింగ్ స్లాబ్ ఉరుస్తోంది. దీంతో తరగతి గదుల్లో వర్షం నీరు చేరుతోంది. క్లాస్రూమ్లలో బెంచీల మీద ప్లాస్టిక్ బకెట్లు పెట్టి టీచర్లు చదువు చెబుతున్నారు.
-రామాయంపేట, వెలుగు
