
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలోని పీఎస్లలో క్రైం రికార్డులు పక్కాగా మెయింటెన్ చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు సూచించారు. మంగళవారం మెదక్ రూరల్, హవేలీ ఘనపూర్ పీఎస్లను తనిఖీ చేశారు. రెండు పీఎస్లలో ఉన్న పరిసరాలను పరిశీలించి ఎస్హెచ్వోల నుంచి పలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రాజారెడ్డి, సందీప్రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్సిబ్బంది ఉన్నారు.
పోలీసులకు క్రమశిక్షణ అవసరం
పోలీస్యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ అవసరమని ఎస్పీ శ్రీనివాస్రావు సూచించారు. జిల్లాలోని ఆర్మ్డ్రిజర్వు, హోమ్గార్డు సిబ్బందికి ఎస్పీ ఆఫీసులో దర్బార్ నిర్వహించి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విధి నిర్వహణలో, వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు. హోమ్గార్డులు లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి శుక్రవారం నేరుగా కలవవచ్చన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగనాయక్, ఆర్ఐలు రామకృష్ణ, శైలేందర్, సీఐలు సందీప్ రెడ్డి, మధుసూదన్ పాల్గొన్నారు.