మెదక్ జిల్లా పీఎస్లలో రికార్డులు పక్కాగా మెయింటెన్ చేయాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు

మెదక్ జిల్లా పీఎస్లలో రికార్డులు పక్కాగా మెయింటెన్ చేయాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు

మెదక్​ టౌన్, వెలుగు:  జిల్లాలోని పీఎస్​లలో క్రైం రికార్డులు పక్కాగా మెయింటెన్​ చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​రావు సూచించారు. మంగళవారం మెదక్​ రూరల్​, హవేలీ ఘనపూర్​ పీఎస్​లను తనిఖీ చేశారు. రెండు పీఎస్​లలో ఉన్న పరిసరాలను పరిశీలించి ఎస్​హెచ్​వోల నుంచి పలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ.. సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, అవసరమైన చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్​, సీఐలు రాజారెడ్డి, సందీప్​రెడ్డి, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్​సిబ్బంది ఉన్నారు. 

పోలీసులకు క్రమశిక్షణ అవసరం

పోలీస్​యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ అవసరమని ఎస్పీ శ్రీనివాస్​రావు సూచించారు. జిల్లాలోని ఆర్మ్​డ్​రిజర్వు, హోమ్​గార్డు సిబ్బందికి ఎస్పీ ఆఫీసులో దర్బార్​ నిర్వహించి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. విధి నిర్వహణలో, వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు. హోమ్​గార్డులు లైఫ్ ఇన్సూరెన్స్​ కలిగి ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి శుక్రవారం నేరుగా కలవవచ్చన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్​లో ఎదురయ్యే ఇబ్బందుల గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్​, డీఎస్పీ రంగనాయక్, ఆర్ఐలు రామకృష్ణ, శైలేందర్​, సీఐలు సందీప్​ రెడ్డి, మధుసూదన్​ పాల్గొన్నారు.