ఫుడ్ మంచిగా పెడుతున్నారా .. విద్యార్థులను అడిగి తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్

ఫుడ్ మంచిగా పెడుతున్నారా .. విద్యార్థులను అడిగి తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ‘మీకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా?.. ఫుడ్​ టేస్టీగా ఉంటుందా?.. ఏమైనా సమస్య ఉంటే చెప్పండి’ అని మేడ్చల్​ మల్కాజిగిరి అడిషనల్​ కలెక్టర్​ రాధికగుప్తా విద్యార్థులను అడిగారు. బుధవారం ఆమె శామీర్ పేట మండలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్​, కాలేజీని విజిట్​ చేశారు. పిల్లలతో మాట్లాడి వారికి పెడుతున్న భోజనంపై ఆరా తీశారు. 

స్టోర్ రూంలో వంట సామగ్రిని  పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంపై కేర్​ తీసుకోవాలని, పరసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం శామీర్ పేట్ జడ్​పీ హైస్కూల్​, ప్రైమరీ పాఠశాలను సందర్శించారు. డీఈవో విజయకుమారి, జిల్లా బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ ఝాన్సీరాణి, ఎస్సీ వెల్ఫేర్​ ఆఫీసర్​ వినోద్ కుమార్ ఉన్నారు.