పెండ్లయిన 6 నెలలకే నవ జంట ఆత్మహత్య..

 పెండ్లయిన 6 నెలలకే నవ జంట ఆత్మహత్య..

కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లాలో కొత్త దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్​ గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(24), కాప్రాలోని జమ్మిగడ్డకు చెందిన బొట్టు వైష్ణవి(22) పెద్దలు ఒప్పుకోకున్నా  ప్రేమ పెండ్లి చేసుకున్నారు. ఆరు నెలల నుంచి కీసర పరిధి బండ్లగూడలోని రాజీవ్​గృహకల్ప కాలనీలో రెంట్​కు ఉంటున్నారు.

ఆంజనేయులు డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల తర్వాత ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు ఆంజనేయులు, వైష్ణవి ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకున్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.