ఇబ్రహీంపట్నం, వెలుగు: తమకు కనీస వసతులు కల్పించాలంటూ మహేశ్వరం మెడికల్ కాలేజీ రెండో రోజు మంగళవారం ఆందోళన చేశారు. హాస్టల్ వసతి, ల్యాబ్స్ లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీరికి మెడికో స్టూడెంట్స్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు సంఘీభావం తెలిపారు. మెడికల్ కాలేజీని డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శివరామప్రసాద్ అక్కడికి చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

