పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా

పార్టీ పరిస్థితిపై  మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా

తెలంగాణలో పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి.  పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆమె.. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులతో వరుసగా సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే.  మొత్తం 17 లోక్ సీట్లు ఉండగా ఇప్పటి వరకు 10 కి పైగా మీటింగ్ లు పూర్తి అయ్యాయి.  ఇవాళ   హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మూడు పార్లెమెంట్ స్థానాల అభ్యర్థులతో భేటీ అయ్యారు. కరీంనగర్ నుంచి  వెలిచాల రాజేందర్, మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ హాజరయ్యారు. 

ఈ మీటింగ్ కంటెస్టెడ్ ఎంపీ , ఎమ్మెల్యే అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు అటెండ్ అయ్యారు.  ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ స్కీమ్ లపై ప్రజల అభిప్రాయాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేస్తున్నారు.

పార్టీని బలోపేతం చేయాలని, విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని, పార్టీ కమిటీలు, ప్రభుత్వ పదవుల్లో నేతలకు కచ్చితంగా అవకాశాలు ఉంటాయని, పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేతలపై పూర్తి సమాచారం తన దగ్గర ఉందని నేతలతో మీనాక్షి అన్నట్లు సమాచారం.