బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లను చిత్తు చిత్తు చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్

బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లను చిత్తు చిత్తు చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్

మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్, అతని అనుచరులు మద్యం మత్తులో అర్థరాత్రి(సెప్టెంబర్ 22) రెచ్చిపోయారు. బీజేపీ నాయకులపై దాడి చేసి.. రోడ్డుపై ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్లను చించేశారు. 

మీర్ పేట్ లోని నంది హిల్స్ రోడ్ నెంబర్ 9లో వినాయక మండపం దగ్గర ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లను చించేశారు. బీజేపీ జండాలు, ఫ్లెక్సీలు ఉండొద్దంటూ.. 10వ వార్డు కార్పొరేటర్ ముద్దు పవన్ కుమార్ పార్టీ కార్యకర్తలు, అనుచరులకు హుకుం జారీ చేశారు. దీంతో మండపం దగ్గర ఉన్న ఫ్లెక్సీలు, కటౌట్లను తుక్కు తుక్కు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ తర్వాత బీజేపీ అంతు చూస్తామని మండపం వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డి.. మండపంలో ఉన్న వారిపై దాడి చేశారు. 

ALSO READ : మళ్లీ మళ్లీ రద్దు అయిన గ్రూప్ 1

గతంలో మీర్ పేట్ కార్పొరేటర్లపై ముద్ద పవన్ దాడి చేసిన ఘటనలు జరిగాయి. ఆ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు ముద్ద పవన్. అతను మీర్ పేట్ లో రౌడీయిజం చలాయిస్తూ.. స్థానికులు, ప్రజా ప్రతినిధులపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు.