స్కిల్ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి : మంత్రి శ్రీధర్ బాబు

స్కిల్  వర్సిటీ అభివృద్ధికి సహకరించండి :  మంత్రి శ్రీధర్ బాబు
  • కేంద్ర మంత్రి జయంత్ చౌదరికి మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి

బషీర్​బాగ్, వెలుగు: తెలంగాణను ‘ప్రపంచ నైపుణ్యాభివృద్ధి రాజధాని’ గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో యంగ్  ఇండియా స్కిల్  యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఈ వర్సిటీకి కేంద్ర సహకారం కావాలని కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరిని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్  బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉస్మానియా పీజీ లా కాలేజీలో సోమవారం నిర్వహించిన ‘మెగా జాబ్, స్కిల్, లోన్ మేళా’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్  బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. 

యువత శిక్షణకు కొత్త కోర్సులు రూపొందిస్తున్నామని తెలిపారు. నైపుణ్యానికి తగ్గ ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్  యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర మంత్రి జయంత్  చౌదరి మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. యువతలో నైపుణ్యం పెరిగితే, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తెలంగాణ మినరల్  డెవలప్ మెంట్  కార్పొరేషన్  లిమిటెడ్  చైర్మన్  అనిల్  కుమార్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.