
పద్మారావునగర్,వెలుగు: భారత ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఇందు గ్రేవాల్ గురువారం సికింద్రాబాద్ ఎంజీఎం దవాఖానను సందర్శించారు. పీడియాట్రిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పీడియాట్రిక్ హెల్త్ క్యాంపును ప్రారంభించారు.
చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు, పోషకాహారం, టీకాలు, ఆరోగ్య సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణి, పీడియాట్రిక్ హెడ్ డాక్టర్ వాసుదేవ్, డాక్టర్ అజయ్ మోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్కుమార్
పాల్గొన్నారు.