జాతిపిత మహాత్మగాంధీని చంపింది ఎవరంటే.. ఎవరైనా ఠక్కున చెప్పే పేరు నాథురాం గాడ్సే. ఆ నాథురాం గాడ్సే పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టినరోజును గుర్తుచేస్తూ మెగా బ్రదర్ నాగబాబు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. నాథురాం గాడ్సే గాంధీని చంపి ఉండవచ్చు.. కానీ, ఆయన ఒక నిజమైన దేశభక్తుడు అని నాగబాబు గాడ్సేను కొనియాడారు. గాడ్సే వాదనను అప్పటి ఏ మీడియా కూడా చెప్పలేదని ఆయన అన్నారు. అప్పటి మీడియా కూడా అధికార ప్రభుత్వానికి లోబడే పనిచేసిందని ఆయన అన్నారు. గాడ్సే ఆత్మకు శాంతి కలగాలని నాగబాబు ప్రార్థించారు.
నాగబాబు పోస్టు చేసిన ట్వీట్ మీకోసం యదావిధిగా..
‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టిన రోజు. ఆయన నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా? కాదా? అనేది చర్చనీయాంశం. కానీ, అతని ఆర్గ్యూమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. అప్పటి మీడియా కేవలం అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తాను అనుకున్నది చేశాడు. కానీ, నాథురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది. పాపం నాథురాం గాడ్సే… మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్’ అని ట్వీట్ చేశారు.
ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది debatable. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ..contd pic.twitter.com/WNIpG6gsVO
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 19, 2020