డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసిన చిరంజీవి

  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసిన చిరంజీవి

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మెగాస్టార్ చిరంజీవి దంపతులు జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ లో  2024  జనవరి 04 గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.   ఈ సందర్భంగా చిరంజీవి దంపతులకు కుటుంబసభ్యులతో కలిసి భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం, శాలువాతో వారిని సత్కారించారు. 

అనంతరం భట్టి విక్రమార్కను కశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి సత్కరించారు.  కాసేపు ప్రజా భవన్ లో కూర్చుని ముచ్చటించారు.  ఈ భేటీలో డిప్యూటీ సీఎం వెంట ఆయన సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. . ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కొన్నిరోజుల ముందు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో భేటీ అయిన సంగతి తెలిసిందే.