ఏపీ వర్షాలపై అభిమానులకు మెగాస్టార్ రిక్వెస్ట్

ఏపీ వర్షాలపై అభిమానులకు మెగాస్టార్ రిక్వెస్ట్

చిత్తూరు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తిరుపతి మొత్తం అతలాకుతలం అవుతోంది. కొండచరియలు విరిగిపడి భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో కాలినడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాల ధాటికి భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలో ఏర్పడిన ఈ విపత్కర పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం తిరుపతిలోని పరిస్థితులు చూస్తుంటే మనసు కలచివేస్తోందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం, టీటీడీ కలిసికట్టుగా పనిచేసి సాధారణ పరిస్థితులు వచ్చేలా చేయాలని ఆయన సూచించారు. అలాగే భక్తులకు, స్థానికులకు చేయూతనివ్వాల్సిందిగా తన అభిమానులను కోరారు. దీనికి సంబంధించి ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.