
మౌనంగా ఉండే వాళ్లను అస్సలు నమ్మకూడదు.. అరిచే వాళ్లను అయినా నమ్మొచ్చు ఏమోకానీ.. మౌనం అనేది చాలా ప్రమాదకరం.. మౌనంగా ఉండేవాళ్ల ఇంత కిరాతకంగా ఉంటారా.. ఈ మాటలు అన్నిది ఎవరో తెలుసా.. బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఏ విషయంపై అంటారా.. హనీమూన్ మర్డర్ గురించి.. పెళ్లి చేసుకుని భర్తతో హనీమూన్ వెళ్లిన భార్య.. భర్తను ప్లాన్ చేసి.. చంపేసిన ఘటనపై ఎంపీ కంగనా రనౌత్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
మీడియాలో వచ్చిన భార్య సోనం ఫొటోలు చూసిన తర్వాత.. వార్తలు చదివిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారామె. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్ స్టా గ్రామ్ వేదికగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాజా రఘువంశీ హత్య కేసు నాకు అర్ధం కావడం లేదు. తన తల్లిదండ్రులకు భయపడి వివాహాన్ని తిరస్కరించలేని ఒక మహిళ.. కానీ ఆమె కాంట్రాక్ట్ కిల్లర్తో క్రూరమైన హత్యకు ప్లాన్ చేస్తుంది. ఇది చాలా అసంబద్ధంగా ఉందని కంగనా పోస్ట్లో రాసుకొచ్చారు.
‘‘ఇది ఎంత అసంబద్ధం. తన సొంత తల్లిదండ్రులంటే భయపడి పెళ్లికి నో చెప్పలేని ఒక స్త్రీ.. సుపారీ కిల్లర్లతో దారుణమైన హత్యకు ప్లాన్ చేయగలదు. ఉదయం నుంచి ఈ ప్రశ్న నా మనసులో మొదలుతోంది. ఆమె విడాకులు తీసుకోలేకపోయింది. లేదా తన ప్రేమికుడితో పారిపోలేకపోయింది. ఇది ఎంత క్రూరమైనది, హేయమైనది. అన్నింటికంటే అసంబద్ధమైనది, మూర్ఖత్వం.
మూర్ఖులను వ్యక్తులను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వారు ఏ సమాజానికైనా అతిపెద్ద ముప్పు. మనం తరచుగా వారిని చూసి నవ్వుతాము. వారు హాని చేయరని అనుకుంటాము. కానీ అది నిజం కాదు. తెలివైన వ్యక్తులు తమ మంచి కోసం ఇతరులకు హాని కలిగిస్తారు. కానీ మూర్ఖులు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియదని గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉన్న మూర్ఖులతో జాగ్రత్తగా ఉండండి’’ అని పోస్ట్లో కంగనా ఈ ఇష్యూపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.