నన్ను భారత ఏజెంట్లు దారుణంగా కొట్టిన్రు

నన్ను భారత ఏజెంట్లు దారుణంగా కొట్టిన్రు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి  మెహుల్‌ చోక్సీ తన కిడ్నాపింగ్ వ్యవహారంపై స్పందించాడు. ఆంటిగ్వా నుంచి తనను కిడ్నాప్ చేసిన వారిలో ఇద్దరు ‘రా’ (రీసెర్చ్అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్స్ ఉన్నారని చోక్సీ తెలిపాడు. ప్రస్తుతం ఆంటిగ్వా లో ఉన్న ఆయన ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తన కిడ్నాపింగ్ సమయంలో గుర్మీత్ సింగ్, గుర్ జిత్ భండాల్ అనే వ్యక్తులు కొట్టారని వెల్లడించాడు. అప్పుడు తాను బార్బరా జరాబికా అనే మహిళ ఇంట్లో ఉన్నానని.. అక్కడ తనపై దాడి జరుగుతుండగా ఈ ఇద్దరు వ్యక్తులూ తమను ‘రా’ ఏజెంట్లుగా చెప్పుకున్నారని పేర్కొన్నాడు. డొమినికాకు చేరినప్పుడు కూడా ఈ ఇద్దరూ తన కాళ్లు, చేతులు పట్టుకుని.. ఇష్టం వచ్చినట్టు కొట్టారన్నాడు. తనకు స్పృహ కోల్పోయినంత పనయిందన్నాడు.