విభజన హామీలపై రాష్ట్రపతికి టీటీడీపీ నేతల వినతిపత్రం

విభజన హామీలపై రాష్ట్రపతికి టీటీడీపీ నేతల వినతిపత్రం

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో టీడీపీ  నాయకుల బృందం సభ్యులు  ద్రౌపది ముర్ము ని కలిశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ప్రజా సమస్యలను, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను పరిష్కరించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇప్పించాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రాన్ని అందజేశారు.

ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆమెతో పాటు గవర్నర్ తమిళి సై, మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. స్ఫూర్తి కేంద్రంలోని 3వ నంబర్ గేట్ వద్ద త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రామ నగరంలోని 108 అడుగుల శ్రీరామానుజాచార్య విగ్రహాన్ని, రామానుజుని స్వర్ణ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళ శాసనాలు ఇచ్చారు. స్వర్ణ రామానుజన్ విగ్రహం.. తీర్ధ ప్రసాదాలను అందచేశారు. అనంతరం 108 ఉపాలయాలను రాష్ట్రపతి ముర్ము సందర్శించారు. ఉపాలయాల విశిష్టతను చినజీయర్ స్వామి ఆమెకు వివరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన డైనమిక్ ఫౌంటెయిన్ షో , స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ త్రీడీ లేజర్ షోలను ముర్ము తిలకించారు. సందర్శన అనంతరం ముచ్చింతల్ నుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారం బయలుదేరారు.