పడితే పోతావ్ రా.. రైలు బోగీ వెనకలా ఇలా ప్రయాణం

పడితే పోతావ్ రా.. రైలు బోగీ వెనకలా ఇలా ప్రయాణం

పది రూపాయల టికెట్ కోసం కక్కుర్తి పడితే ప్రాణాలు పొవచ్చు.. 20 రూపాయలు మిగల్చటం కోసం సాహసాలు చేస్తే అడ్రస్ గల్లంతు కావొచ్చు.. 40 రూపాయలు ఎందుకు పెట్టాలి అని ఆలోచిస్తే ఆ తర్వాత మనిషే ఉండకపోవచ్చు.. అవును.. ఇంత చిన్న అమౌంట్ కోసం ఏకంగా ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రయాణాలు చేస్తున్నారు కొందరు. ఒడిశాలో జరిగిన ఘటన ఇలాంటిదే. రైలు టికెట్ కొనకుండా.. ప్రాణాలను ఫణంగా పెట్టి దొంగతనంగా రైలు జర్నీ చేస్తున్నారు కొంత మంది ప్రయాణికులు. ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే...

రైల్వే స్టేషన్  నుంచి కదులుతున్న ట్రైయిన్ వెనకాల  ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. రైలు వెనకాల బోగీకి అమర్చిన హ్యాండిల్‌ను పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు  ప్రశాంతంగా బఫర్ స్ప్రింగ్‌పై కూర్చుని నవ్వుతుండటం విశేషం. జర్నీ చేసేటప్పుడు బోగీ బఫర్ స్ప్రింగ్‌లు అనేవి   రెండు బోగీల మధ్య  బలమైన కుదుపులు రాకుండా చూసుకుంటుంది. 

Also Read : ఫ్రూట్ ఐస్ తో చర్మంపై దద్దుర్లు, కంటికింద నలుపు మాయం

ఇద్దరు వ్యక్తులు  రైలు వెనకాల కూర్చోవడానికి కరెక్ట్ రీజన్స్ అయితే తెల్వదు. అయితే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారని తెలుస్తోంది. ఇలా ప్రయాణించడం చాలా నేరం అంతేగాకుండాప్రాణాలకే ప్రమాదం.  ఎస్పీ క్రియేషన్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.  డబ్బులకు కక్కుర్తి పడితే ప్రాణాలు పోతాయని కామెంట్ చేస్తున్నారు.