మూడు రోజుల పాటు వానలు..వాతావరణ శాఖ హెచ్చరిక

 మూడు రోజుల పాటు వానలు..వాతావరణ శాఖ హెచ్చరిక

రాష్ట్రంలో  రాగల మూడు రోజులు  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే  అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల ఐదు రోజులుల్లో  రాష్ట్రంలో చాలా చోట్ల   పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్  కన్నా తక్కువగా  నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  కొన్ని చోట్ల 35°C కన్నా తక్కువగా   నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఏప్రిల్ 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు,  మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీన  గంటకు 40 నుండి 50  కిలో  మీటర్ల వేగంతో..ఏప్రిల్ 26వ తేదీన, ఏప్రిల్ 27వ తేదీన  30  నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీంతో పాటు.. వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ  పడే అవకాశం ఉందని వెల్లడించింది. 

ఏప్రిల్ 25వ తేదీన ఉపరితల ద్రోణి  పశ్చిమ విదర్బలోని ఆవర్తనం నుండి  మరాఠ్వాడ  మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.  దిగువ స్థాయిలోని గాలులు  దక్షిణ,..ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తాయని పేర్కొంది.