మెట్రో రైళ్లు  6 గంటలు బంద్

మెట్రో రైళ్లు  6 గంటలు బంద్

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్​లో మెట్రో రైళ్లు 6 గంటల పాటు నిలిచిపోయాయి. సిటీలో ఆందోళనల కారణంగా.. మెట్రో రైళ్లను నిలిపివేసినట్లు ఎల్ అండ్ టీ ప్రకటించింది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో చాలాచోట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితులు కంట్రోల్ అయ్యాక సాయంత్రం 6.30 గంటల నుంచి రైళ్లను తిరిగి ప్రారంభించారు.