
- ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు ఎందుకు జరుపుకోలేదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్తో పాటు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పట్టలేదా..? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను బీఆర్ఎస్ నాయకులు అవమానించారని చెప్పారు. తెలంగాణ పరువును కేటీఆర్ టెక్సాస్ లో బజారున పడేశారని మండిపడ్డారు. ఆయన తలదాచుకోవడానికి టెక్సాస్ లో విల్లా కొన్నారని, తప్పుచేస్తే ఎక్కడ దాచుకున్న వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సెటిల్ చేయడానికి కేటీఆర్ విదేశాలకెళ్లారని విమర్శించారు.