గుండెపోటుతో మిడ్ మానేరు నిర్వాసితుడు మృతి

గుండెపోటుతో మిడ్ మానేరు నిర్వాసితుడు మృతి

మిడ్ మానేరు ముంపు గ్రామంలో విషాదం జరిగింది. వేములవాడ మండలం అరెపల్లిలో గడ్డం కిషన్ గుండెపోటుతో చనిపోయాడు. మిడ్ మానేరు సమస్యల పరిష్కారం కోసం నిన్న నిర్వహించిన మహా పాదయాత్రలో కిషన్ పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన ముగిశాకా ఇంటికి వెళ్లిన గడ్డం కిషన్.. గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ప్రభుత్వ పరిహారంపై బెంగతోనే కిషన్ చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అరెపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.