మిడ్ మానేరు 2014 తర్వాతే పూర్తయింది

మిడ్ మానేరు 2014 తర్వాతే పూర్తయింది

మిడ్ మానేరు ఎల్లంపల్లి 2014 తర్వాతే పూర్తయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మిడ్ మానేరు కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యిందని చెప్పడం పెద్ద అబద్దమని అన్నారు. రూ. 775 కోట్లు ఖర్చు చేసి మిడ్ మానేరు, ఎల్లంపల్లి పూర్తి చేశామని తెలిపారు. సభలో మంత్రి ఉత్తమ్ గొడెల్స్ ప్రచారం చేశారని ఆరోపించారు. ఆయకట్టు విషయంలో రెండు వేర్వేరు చోట్ల లెక్కలు ఇచ్చారని తెలిపారు. వైట్ పేపర్ ఫాల్స్ పేపర్ అని విమర్శించారు. గత ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ. 17  వేల 725 కోట్లు కేటాయించారని సంవత్సర తర్వాత కొత్త జీవో తెచ్చి రూ. 38 వేల 500 కోట్లకు ప్రాజెక్టు కాస్ట్ పెంచారని అన్నారు. నాలుగు జిల్లాల్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును శంకుస్తాపన చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 2012 నాటికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 168 కోట్లు మాత్రమే అని మొబిలైజేషన్ కోసం రూ. 1 వెయ్యి 465 కోట్ల రూపాయలు బిల్లులు తీసుకున్నారని చెప్పారు.