LAC వెంబడి అర్ధరాత్రి కాల్పులు కలకలం

LAC వెంబడి అర్ధరాత్రి కాల్పులు కలకలం

తూర్పు లడఖ్ ఏరియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ LAC వెంబడి అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ఐతే చైనా మాత్రం భారత సైనికులే హెచ్చరికగా కాల్పులు జరిపారని ఆరోపిస్తుంది. భారత సైనికులు LAC దాటి ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డున ఉన్న షెన్ పావో పర్వత ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించారని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న చైనీస్ గార్డులపై ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆరోపించింది. దీంతో తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా స్పష్టం చేసింది. ఈ రెచ్చగొట్టే విధానాన్ని మానుకోవాలని  కోరింది. మరోవైపు ఇవాళ ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారు. గత రెండు వారాల్లో చైనా బలగాలు రెండు సార్లు వాస్తవ సరిహద్దును మార్చేందుకు ప్రయత్నించాయి. ఐతే చైనా బలగాల ప్రయత్నాన్ని భారత సైనికులు తిప్పికొట్టారు.